
నిజామాబాద్లోని గిరిరాజ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో రైతు అనుబంధ సంఘాలు సోమవారం రైతు మహోత్సవ సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా ఇన్ఛార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. సేంద్రియ విధానంలో రైతులు పంటలు సాగు చేయడం శుభ పరిణామం అన్నారు. జిల్లా అధికారులు, మంత్రులు, కార్యక్రమంలో ఎమ్మెల్యేలు, 5 జిల్లాల నుంచి రైతులు పాల్గొన్నారు.