
పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో నిర్వహించిన పీజీఆర్ఎస్ కార్యక్రమంలో అర్జీదారుల నుంచి వచ్చిన ఫిర్యాదులను నిర్దేశించిన గడువులోగా పరిష్కరించాలని సంబంధిత శాఖల అధికారులను నరసాపురం ఆర్డీఓ దాసిరాజు ఆదేశించారు. సోమవారం నరసాపురం సబ్ కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల వ్యవస్థ కార్యక్రమంలో రెవెన్యూ డివిజన్ పరిధిలో 42 ఫిర్యాదులు అర్జీదారుల నుంచి స్వీకరించినట్లు ఆయన పేర్కొన్నారు.