
అలాగే తెలుగులో డి ఫర్ దోపిడీ, నేనొక్కడినే సినిమాలలో కూడా నవీన్ నటించిన. నవీన్ పోలిశెట్టి ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ అనే సినిమాతో హీరోగా మారాడు. ఇటువంటి అంచనాలు లేకుండా రిలీజ్ అయిన ఈ సినిమా సూపర్ హిట్ అయింది. ఈ సినిమాలో నవీన్ తన అద్భుతమైన నటనతో తెలుగు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాడు. కామెడీ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ గా తెరుకెక్కిన ఈ సినిమా 2019లో ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ విజయం సొంతం చేసుకుంది.ఈ కథ మొత్తం నెల్లూరుకు చెందిన ఒక క్రైమ్ యూనివర్సిటీ సాగుతుంది. ఈ సినిమాలో దాదాపు అందరూ కొత్త నటీనటులు ఉన్నారు. ఈ సినిమాకు స్వరూప ఆర్ఎస్జే దర్శకత్వం వహించారు. ఇక ఈ సినిమా కథను హీరో నవీన్ పోలిశెట్టి అందించడం జరిగింది. ఇక ఈ సినిమాలో హీరోయిన్గా నటించిన అమ్మాయి ప్రేక్షకులకు ఇప్పటికీ బాగా గుర్తుండే ఉంటుంది.
ఈ హీరోయిన్ పేరు శృతి శర్మ. మోడలింగ్ రంగంలో తన కెరియర్ మొదలుపెట్టిన శృతి శర్మ ఆ తర్వాత హీరోయిన్ గా అడుగుపెట్టింది. బుల్లితెర మీద కూడా ఈమె అలరించండి. బిగ్ బాస్ హిందీ రియాలిటీ షోలో కూడా శృతి శర్మ పాల్గొంది. ఇక ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ సినిమాతో హీరోయిన్గా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది. హిందీలో ఈ చిన్నది పగలైట్ అనే సినిమాలో నటించింది. రీసెంట్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన హీరమండీ డైమండ్ బజార్ సినిమాలో కూడా శృతి శర్మ నటించడం జరిగింది. ఇక సోషల్ మీడియాలో ఈ చిన్నది చాలా యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు తన గ్లామరస్ ఫోటోలను షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటూ ఉంటుంది.