
ఇంతలో ఏం జరిగింది
రోహిత్ శర్మకు, టీమిండియా కోచ్ గౌతమ్ గంభీర్ కు రెడ్ బాల్ ఫార్మాట్ విషయంలో తీవ్రంగా చర్చ జరిగినట్టు తెలుస్తోంది. అయితే కెప్టెన్సీ నుంచి తప్పుకోవాలని బిసిసిఐ పెద్దలు గతంలో జరిగిన ఆస్ట్రేలియా సిరీస్ నుంచి సంకేతాలు ఇస్తున్నట్టు తెలుస్తోంది. అయితే దీనిపై కాస్త గడువు కావాలని రోహిత్ అప్పట్లో కోరినట్టు తెలుస్తోంది. మరోవైపు చాంపియన్స్ ట్రోఫీ గెలిచిన తర్వాత రోహిత్ పై సెలక్షన్ కమిటీ కాస్త మెతక వైఖరి ప్రదర్శించినట్టు సమాచారం. దీంతో టెస్ట్ జట్టుకు కూడా రోహిత్ శర్మనే నాయకత్వం వహిస్తాడని అందరూ అనుకున్నారు. కానీ ఇంతలోనే సెలక్షన్ కమిటీ సంచలన నిర్ణయం తీసుకునే దిశగా సంకేతాలు ఇవ్వడంతో మొత్తం గారు రోహిత్ తన టెస్ట్ ఫార్మాట్ కు వీడ్కోలు పలికాడు. తద్వారా కేవలం వన్డే జట్టుకు మాత్రమే అతడు నాయకుడిగా కొనసాగనున్నాడు. అయితే రోహిత్ తర్వాత టీమిండియా టెస్ట్ చెట్టుకు నాయకుడు ఎవరు అనే ప్రశ్నకు అనేకమంది ఆటగాళ్ల పేర్లు వినిపిస్తున్నప్పటికీ.. ఈ జాబితాలో టీమిండియా వైస్ కెప్టెన్ గిల్ ముందు వరుసలో ఉన్నాడని ప్రచారం జరుగుతోంది.