
తక్కువ పరుగులతో గెలిచిన మ్యాచ్లు ఇవే
ఐపీఎల్ చరిత్రలో ఒకటి లేదా అంతకంటే ఎక్కువ పరుగుల తేడాతో బెంగళూరు ఐదు మ్యాచ్లు గెలిచింది.
2021లో ఢిల్లీ క్యాపిటల్స్ పై అహ్మదాబాద్ వేదికగా జరిగిన మ్యాచ్లో ఒక్క పరుగు తేడాతో బెంగళూరు గెలిచింది.
2016లో పంజాబ్ జట్టుతో మొహాలీ వేదికగా జరిగిన మ్యాచ్లో ఒక్క పరుగు తేడాతో గెలిచింది.
2019లో బెంగళూరు వేదికగా చెన్నై జట్టుతో జరిగిన మ్యాచ్లో ఒక్క పరుగు తేడాతో బెంగళూరు గెలిచింది.
2013లో బెంగళూరు వేదికగా ముంబై ఇండియన్స్ జట్టుతో జరిగిన మ్యాచ్లో బెంగళూరు 2 రన్స్ వ్యత్యాసంతో విక్టరీ సాధించింది.
2025లో బెంగళూరు వేదికగా చెన్నై జట్టుతో జరిగిన మ్యాచ్లో బెంగళూరు 2 రన్స్ స్వల్ప వ్యత్యాసంతో గెలిచింది.
స్వల్ప తేడాతో..
ఇక స్వల్ప తేడా అంటే ఒకటి కంటే ఎక్కువ పరుగుల వ్యత్యాసంతో చెన్నై జట్టు ఏకంగా ఐదు మ్యాచ్లు ఓడిపోయింది. 2019లో బెంగళూరు వేదికగా బెంగళూరు జట్టుతో జరిగిన మ్యాచ్లో ఒక్క పరుగు తేడాతో చెన్నై ఓడిపోయింది. 2019లో హైదరాబాద్ వేదికగా ముంబై ఇండియన్స్ జట్టుతో జరిగిన మ్యాచ్లో ఒక్క పరుగు తేడాతో చెన్నై సూపర్ కింగ్స్ ఓడిపోయింది. 2025లో బెంగళూరు వేదికగా బెంగళూరు జట్టుతో జరిగిన మ్యాచ్లో రెండు పరుగుల తేడాలతో ఓడిపోయింది. 2023లో చెన్నై వేదికగా రాజస్థాన్ రాయల్స్ జట్టుతో జరిగిన మ్యాచ్లో మూడు పరుగుల తేడాతో ఓడిపోయింది. 2018లో మొహాలీ వేదికగా పంజాబ్ జట్టుతో జరిగిన మ్యాచ్లో నాలుగు పరుగుల తేడాతో చెన్నై ఓడిపోయింది.