
ఆ నివేదిక ప్రకారం, వేడి కారణంగా, గర్భిణీ స్త్రీలలో అకాల ప్రసవం, మృతశిశు జననం, జనన లోపాలు, గర్భధారణ మధుమేహం ప్రమాదం పెరుగుతోంది. ఈ ప్రమాదం ముఖ్యంగా కరేబియన్, దక్షిణ అమెరికా, ఆగ్నేయాసియా, సబ్-సహారా ఆఫ్రికా వంటి అభివృద్ధి చెందుతున్న దేశాలలో ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ ఆరోగ్య సౌకర్యాలు పరిమితం. ఉదాహరణకు, భారతదేశం వంటి దేశాలలో, వేడిలో పనిచేసే గర్భిణీ స్త్రీలలో గర్భస్రావం అయ్యే ప్రమాదం రెట్టింపు అవుతుంది.
వేడితో పాటు, వాతావరణ మార్పుల వల్ల కలిగే వరదలు, అడవి లో చెలరేగే మంటలు కూడా గర్భిణీ స్త్రీలకు సమస్యలను సృష్టిస్తున్నాయి. వరదల కారణంగా కలుషితమైన నీరు గర్భిణీ స్త్రీలలో కడుపు వ్యాధులు, అకాల ప్రసవ ప్రమాదాన్ని పెంచుతుంది. అదే సమయంలో, మంటల నుంచి వచ్చే పొగ పిల్లల ఊపిరితిత్తులు, మెదడు అభివృద్ధికి హాని కలిగిస్తుంది.
గర్భిణీ స్త్రీల శరీరాలు ఉష్ణోగ్రతను నియంత్రించడంలో బలహీనంగా ఉంటాయని దీని వల్ల వారికి వేడి మరింత ప్రమాదకరమని నిపుణులు అంటున్నారు. వాతావరణ మార్పుల ప్రమాదాల నుంచి గర్భిణీ స్త్రీలను రక్షించడానికి తక్షణ చర్యలు తీసుకోవాలని ఈ నివేదిక కోరుతోంది. వేడి నుంచి రక్షించడానికి మెరుగైన ఆరోగ్య సౌకర్యాలు, అవగాహన ప్రచారాలు, గ్రీన్హౌస్ వాయు ఉద్గారాలను తగ్గించడం వంటి సూచనలు ఇందులో ఉన్నాయి. సోషల్ మీడియా వినియోగదారులు కూడా ఈ విషయం గురించి చర్చిస్తున్నారు. ఇది ఇలాగే కంటిన్యూ అయితే మాత్రం సమస్య మరింత తీవ్రతరం అవుతుంది అంటున్నారు నిపుణులు.