
నరేంద్ర మోడీ స్వీయ పర్యవేక్షణ
ఆపరేషన్ సింధూర్ లో భాగంగా భారత సైన్యం చేస్తున్న శత్రుసంహారాన్ని నరేంద్ర మోడీ స్వయంగా పర్యవేక్షించారు. ఆయన వెంట జాతీయ భద్రత సలహాదారు అజిత్ దోవల్ కూడా ఉన్నారు. ఈ క్రమంలో కేవలం ఉగ్రవాదుల స్థావరాలను మాత్రమే తాము నేలమట్టం చేస్తున్నామని.. పాక్ పౌరులకు తాము ఏమాత్రం హాని కలిగించడం లేదని అమెరికాకు ఇండియన్ నేషనల్ డిఫెన్స్ అడ్వైజర్ వివరించారు.. పాకిస్తాన్లో ఉగ్రవాద స్థావరాలు ఉన్నాయని.. వాటిని మాత్రమే తాము టార్గెట్ చేశామని ఇండియన్ నేషనల్ డిఫెన్స్ అడ్వైజర్ అమెరికాకు ఎక్స్ ప్లెయిన్ చేశారు.. ఈ క్రమంలో అమెరికా కూడా భారత్ వెల్లడించిన వివరాలపై సుముఖత వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. మరోవైపు భారత చేస్తున్న దాడులపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్పందించారు. త్వరలో రెండు దేశాల మధ్య సయోధ్య పురకమైన వాతావరణం నెలకొంటుందని వ్యాఖ్యానించారు. బుధవారం ప్రధాని ఆధ్వర్యంలో సిసిఎస్ మీటింగ్ జరగనుంది. ఈ మీటింగ్లో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది. ఇక ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆర్మీకి పూర్తిస్థాయిలో స్వేచ్ఛ ఇచ్చారు. ఏం చేస్తారో చేయండి.. పాకిస్తాన్ జన్మలో భారత్ వైపు చూడొద్దు అని సంకేతాలు ఇచ్చారు.. దానికి తగ్గట్టుగానే భారత ఆర్మీ పూర్తిస్థాయిలో నిమగ్నమైంది. పాకిస్తాన్లో తలదాచుకున్న ఉగ్రవాదులకు చుక్కలు చూపించడం ప్రారంభించింది.. ఆపరేషన్ సింధూర్ మొదలుపెట్టింది.