
పాకిస్తాన్కు ఇస్లాం పేరు పలికే అర్హతలేదు.. ఈ భూమి కోసం ప్రాణాలైనా అర్పిస్తాం..
Asaduddin Owaisi: అమాయకులను, చిన్నపిల్లలను చంపే పాకిస్తాన్ కు ఇస్లాం పేరు పలికే అర్హత లేదన్నారు ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ. అమాయకులను, చిన్న పిల్లలను చంపమని ఇస్లాం చెప్పలేదు అని ఆయన గుర్తు చేశారు. యుద్ధంపై భారత్ వెనక్కి తగ్గే ప్రసక్తే లేదన్నారు. భరతమాత కోసం ప్రాణాలైన అర్పిస్తామన్నారు అసదుద్దీన్ ఓవైసీ.�
ఆ దేవుడి దయతో మనం ఈ భారత భూమిపై జన్మించామని.. ఈ భూమి కోసమే ప్రాణాలు అర్పిస్తామంటూ పేర్కొన్నారు. పాకిస్థాన్ దృశ్చర్యలను ప్రతిఒక్క భారతీయుడు తిప్పికొట్టాలని ఎంఐఎం పార్టీ అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ పిలుపునిచ్చారు.