
– కొలంబొ : శ్రీలంకలో శుక్రవారం ఒక సైనిక హెలికాప్టర్ కుప్పకూలింది. ఈ ఘటనలో ఐదుగురు సైనికులు మరణించినట్లు అధికారులు ఒక ప్ర కటనలో తెలిపారు. సైన్యం, వైమానిక దళానికి చెందిన 12మందిని మిలటరీ పెరేడ్ కోసం తరలిస్తుండగా ఈ ప్రమాదం జరిగిందని వైమానిక ప్రతినిధి ఎరాండా గీగనాగే తెలిపారు. కొలంబోకు ఈశాన్యంగా 280 కిలోమీటర్లు దూరంలో ఉన్న మదురు ఓయాలోని రిజర్వాయర్లో కూలిపోయిందని అన్నారు. సైన్యాన్ని బయటకు తీసి, ఆస్పత్రికి తరలించామని అన్నారు. చికిత్స పొందుతూ ముగ్గురు ఆర్మీ, ఇద్దరు వైమానిక దళానికి చెందిన ఇద్దరు మరణించారని గీగనాగె పేర్కొన్నారు. హెలికాప్టర్ ప్రమాదానికి గల కారణం తెలియాల్సి వుంది.