
చేనేత వృత్తికి సంబంధించిన వాళ్లకు మాత్రమే ప్రభుత్వం రుణమాఫీ ఇస్తుంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వేల మంది చేనేత కార్మికులకు ప్రభుత్వ అందించిన ఈ వార్త చాలా ఊరట కలిగిస్తుంది. దీనికోసం ఇప్పటికే ప్రభుత్వం 33 కోట్ల రూపాయలను ఈ ఏడాది మార్చి నెలలోనే విడుదల చేయడం జరిగింది. కానీ ఇప్పటివరకు ఈ డబ్బు చేనేత కార్మికుల లబ్ధిదారుల అకౌంట్లో జమ కాలేదు. ప్రస్తుతం ప్రభుత్వం అందించిన గైడ్లైన్స్ ప్రకారం డబ్బును లబ్ధిదారుల అకౌంట్లో జమ చేస్తారు. ఈ ప్రక్రియ పూర్తి అవడానికి జిల్లా స్థాయిలో కమిటీలను కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసింది.
డబ్బును లబ్ధిదారుల అకౌంట్లో చేరవేసేందుకు ఈ కమిటీలు చాలా కీలకం కానున్నాయి. అప్పు తీసుకున్న వారితో ఈ కమిటీలు మాట్లాడతాయి. రుణమాఫీకి వాళ్లు అర్హులో కాదో ఈ కమిటీలు నిర్ణయిస్తాయి. అలాగే బ్యాంకులో నుంచి కూడా రుణం తీసుకున్న లబ్ధిదారుల జాబితాను ఈ కమిటీలు సేకరిస్తాయి. ఈ ప్రక్రియ మొత్తం పూర్తి అయిన ఒక వారంలో లబ్ధిదారుల అకౌంట్లో రుణమాఫీని ప్రభుత్వం ఆమోదిస్తుంది. అంటే రుణమాఫీ పొందడానికి ఇప్పటినుంచి పది రోజుల సమయం పడుతుంది. రుణమాఫీ అయిన వాళ్లు ఆ తర్వాత కొత్తగా మళ్లీ రుణం కోసం అప్లై చేసుకోవచ్చు.