
ముఖ్యంగా అల్లు అర్జున్(Icon Star Allu Arjun) అభిమానులు అయితే సంబరాలు చేసుకుంటున్నారు. దేశాన్ని మొత్తం షేక్ చేసిన ఇండస్ట్రీ హిట్ ని అందుకున్న తమ అభిమాన హీరో, ఎంజాయ్ చేయాల్సిన సమయంలో జైలులో గడపాల్సిన పరిస్థితి వచ్చిందని, ఆ నెల రోజులు మొత్తం పుష్ప 2 సక్సెస్ ని ఎంజాయ్ చేయలేకపోయామని, ఇప్పుడు శ్రీతేజ్ కోలుకొని డిశ్చార్జ్ అవ్వడం మాటల్లో చెప్పలేనంత సంతోషంగా ఉందని చెప్పుకొచ్చాడు. శ్రీతేజ్ ఇంత తొందరగా కోలుకోవడానికి తెలంగాణ ప్రభుత్వం ఎంత సహాయ సహకారాలు అందించిందో, అల్లు అర్జున్ కూడా అంతే సహాయ సహకారాలు అందించాడు. ఆ కుర్రాడికి ఎలాంటి కష్టమొచ్చినా దగ్గరుండి చూసుకుంటానని హామీ ఇవ్వడమే కాకుండా, ఆ అబ్బాయి భవిష్యత్తు కోసం రెండు కోట్ల రూపాయిలు ఫిక్సెడ్ డిపాజిట్ కూడా చేసాడు. శ్రీతేజ్ తొందరగా కోలుకోకుంటే, అతన్ని విదేశాలకు తీసుకెళ్లి మెరుగైన వైద్యం అందించే ప్రయత్నం కూడా చేసాడు అల్లు అర్జున్.
తొందరగా ఆ కుర్రాడు ఇంకా సంపూర్ణంగా కోలుకొని, తన తోటి పిల్లలు లాగానే ఆడుకుంటూ, చదువుకుంటూ ఉండాలని సోషల్ మీడియా ద్వారా నెటిజెన్స్ కోరుకుంటున్నారు. డిశ్చార్జ్ అయిన తర్వాత ఎదో ఒక సమయంలో తీరిక చూసుకొని అల్లు అర్జున్ ఈ కుర్రాడిని కలిసే అవకాశం కూడా ఉందని విశ్వసనీయ వర్గాల సమాచారం. చూడాలి మరి రాబోయే రోజుల్లో ఈ కుర్రాడు ఎంత తొందరగా కోలుకుంటాడు అనేది. ప్రస్తుతానికి అల్లు అర్జున్ విదేశాల్లో ఉన్నాడు. ఆయన ఇండియా కి తిరిగి రాగానే అట్లీ తో చేయబోయే సినిమా వర్క్ షాప్ లో పాల్గొనే అవకాశం ఉంది. సైన్స్ ఫిక్షన్ నేపథ్యం లో సాగే ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్స్ నటించబోతున్నారట. అల్లు అర్జున్ ఇందులో డ్యూయల్ రోల్ చేయబోతున్నాడు.