సోమవారం రాత్రి మునగాల పోలీస్ స్టేషన్ పరిధిలోని ముకుందాపురం వద్ద జాతీయ రహదారి 65పై రోడ్డు ప్రమాదంలో మరణించిన కానిస్టేబుల్ రాంబాబు భౌతికకాయానికి జిల్లా ఎస్పీ కొత్తపల్లి నరసింహగౌడ్, పూలమాలవేసి పోలీస్ శాఖ తరపున ఘనంగా నివాళులర్పించారు. రాంబాబు మరణించడం చాలా బాధాకరం అన్నారు. దహన సంస్కారాల నిమిత్తం కానిస్టేబుల్ కుటుంబానికి తక్షణ ఆర్థిక సహాయాన్ని అందించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ రాంబాబు కుటుంబాన్ని పోలీస్ శాఖ అన్ని విధాల ఆదుకుంటుందని అన్నారు. ఆ కుటుంబానికి ప్రభుత్వం ద్వారా, పోలీసు శాఖ ద్వారా రావలసిన అన్ని రకాల ఆర్థిక తోడ్పాట్లను, ప్రభుత్వ సహాయంతో అందించే కారుణ్య నియామక ఉద్యోగం త్వరగా వచ్చేలా కృషి చేస్తాం అన్నారు. వెంట మునగాల సీఐ రామకృష్ణా రెడ్డి, సూర్యాపేట పట్టణ ఇన్స్పెక్టర్ వీర రాఘవులు, పోలీసు సంఘం అధ్యక్షులు రామచందర్ గౌడ్, మునగాల ఎస్ ఐ ప్రవీణ్ కుమార్, కోదాడ ట్రాఫిక్ ఎస్ ఐ మల్లేశం, పోలీసు సిబ్బంది, మృతుని బంధువులు ఉన్నారు.
