దొంగతనాలపై ప్రత్యేక దృష్టి పెట్టామని రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ మహేశ్ బి.గీతే అన్నారు. ప్రజలు పోలీసుల సూచనలు పాటించి దొంగతనాల నియంత్రణకు సహకరించాలన్నారు. అనుమానిత వ్యక్తుల కదలికలను గమనించి, పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు. వేసవిలో పిల్లలకు సెలవులుండటంతో చాలా మంది ప్రయాణాలు చేస్తారు. ఇదే అదనుగా దొంగలు చేతివాటం ప్రదర్శిస్తారని పేర్కొన్నారు.
