సౌదీ అరేబియా పర్యటనలో ఉన్న PM నరేంద్ర మోదీ కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు ఫోన్ చేశారు. జమ్మూకశ్మీర్లో పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడి గురించి అడిగి తెలుసుకున్నారు. దాడికి పాల్పడిన వారిపై కఠినంగా చర్యలు తీసుకోవాలని, ఘటనాస్థలికి వెళ్లి పరిశీలించాలని అమిత్ షాను PM ఆదేశించారు. ఈ నేపథ్యంలో ఆయన ఉన్నతాధికారులతో అత్యవసర సమావేశం నిర్వహించారు. ఉగ్రదాడిలో ఇప్పటి వరకు ఐదుగురు మృతిచెందినట్లు తెలుస్తోంది.
